telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్లమెంటుకు సమావేశాలకు హాజరైన చిదంబరం!

congress chidambaram

ఐన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. కేసులో మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రాజ్యసభలో ఆయనమాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఐన్‌ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు గతనెల 15న చిదంబరానికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయనపై ఉన్న ఆరోపణల దృష్ట్యా బెయిలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. అయితే, ఆయన సుప్రీంకోర్టును అశ్రయించగా బెయిల్ మంజురైంది. దీంతో నిన్న తీహార్ జైలు నుంచి విడుదలై ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.

Related posts