telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు సంచలన తీర్పుపై సీఎం జగన్‌ హ‌ర్షం..

బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం..

అయితే, రమ్య కేసు తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు.

ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది.

Related posts