telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బైజూస్‌తో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం : స‌ర్కార్ స్కూల్స్ లో ఇక నుంచి బైజూస్ కంటెంట్‌తో క్లాసులు

*బైజూస్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం..
*4-10 త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు బైజూస్ కంటెంట్‌
*త‌న జీవితంలో ఇవాళ అత్యంత ముఖ్య‌మైన రోజు
*8వ‌త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ట్యాబ్‌లు ,
*ప్ర‌తీ క్లాస్ రూంలో టీవీలు..
*ఈ ఏడాది నుంచి 8 త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు బైజూస్ క్లాసులు..
*టీవీలు ద్వారా బైజూస్ కంటెంట్‌తో పాఠాలు..
*నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలో ఇది ఒక మైలురాయి
*వ‌చ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో పుస్త‌కాలు..

ఏపీలోని విద్యా వ్య‌వ‌స్థ‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో అడుగువేసింది. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్ధుల‌కు మ‌రింత నాణ్య‌మైన‌ విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

సీఎం జ‌గ‌న్‌ సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఎక్కడైన, ఏవిధంగానైనా చదువుకునేందుకు ఈ– లెర్నింగ్‌ కార్యక్రమంపై ఆయన చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బైజూ రవీంద్రన్‌ సీఎం జగన్ తో చెప్పారు. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ..పేద పిల్లల జీవితాలను ఈ కార్యక్రమం మారుస్తుందన్నారు. త‌న జీవితంలో ఇవాళ అత్యంత ముఖ్య‌మైన రోజు అని సీఎం అన్నారు.

పిల్లలకు మంచి చదువులను అందించేందుకు ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. పదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో సహాయపడుతోందన్నారు. బైజూస్‌ ద్వారా నాణ్యమైన కంటెంట్ విద్యార్థులకు అర్థం అయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్‌ ప్రభుత్వ పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ-లెర్నింగ్ అందుబాటులోఉంటుందన్నారు.

విద్యారంగంలో ఇదొక మేలిమలుపు అని అన్నారు. బైజూస్ కంటెంట్ ను ప్రభుత్వం స్కూళ్లలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకోస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తామన్నారు. డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పదోతరగతి సీబీఎస్‌ పరీక్షలను సులభంగా ప్రిపేర్ అవుతారన్నారు. టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుందన్నారు. ఉపాధ్యాయులు బోధనను మరింత నాణ్యంగా అందించగలరని తెలిపారు.

విద్యార్థుల ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. విద్యారంగ వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ ముందుకు రావడం శుభపరిణామం అని సీఎం జగన్ అన్నారు.

2025 నాటికి పదోతరగతి విద్యార్థులు అంటే ..ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు..తమ 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌నమూనాలో రాస్తారన్నారు. ఈ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి రానుంది.

డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం∙అన్నీకూడా పిల్లలకు అందుబాటులోకి వస్తాయ‌న్నారు దీనివల్ల వీళ్లు తమ పదోతరగతి సీబీఎస్‌ పరీక్షలను సులభంగా ఎదుర్కొంటార‌ని సీఎం అన్నారు.

 

Related posts