‘జై సీతారాం’ నినాదాన్ని బీజేపీ వక్రీకరించి ‘జైశ్రీరాం’ అంటూ కొత్త నినాదాన్ని తీసుకొచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ కూడా సీతామాతను ప్రస్తావించారని, రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం అన్నారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో జైశ్రీరాం వివాదం నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. జైశ్రీరాం నినాదంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, కాకపోతే రాజకీయాలకు మతాన్ని జోడించి బెంగాల్ను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలో మమత తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్ను మార్చారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, మాతంగిని హజ్రా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖాజీ నెహ్రుల్ ఇస్లాం ఫొటోలను చేర్చారు. ‘జై హింద్, జై బంగ్లా’ అనే నినాదాన్ని పెట్టారు. మమత తీరుపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తీవ్ర విమర్శలు చేశారు. ఆమె అనుభవజ్ఞురాలే అయినా ప్రవర్తన మాత్రం అనాగరికంగా ఉందని విమర్శించారు.
వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు