ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య పరస్పరం ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగం విఫలం చెందిన సందర్భంగా కూడా దీదీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మోదీతో రేపు సాయంత్రం మమత భేటీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మోదీ రెండో దఫా ప్రధాని ప్రమాణస్వీకారానికి గైర్హాజరవడంతో పాటు, నీతి అయోగ్ భేటీకి డుమ్మా కొట్టిన మమత ఇప్పటికిప్పుడు మోదీకి బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు ప్రత్యేకంగా కలవనుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానిని మర్యాదపూర్వకంగానే కలుస్తున్నానని, రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదన, పెండింగ్ నిధుల అంశం ప్రధానితో చర్చించనున్నానని ఆమె వెల్లడించారు.
గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: అమిత్ షా!