telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం కేసీఆర్

kcr governor tamilisai

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మునికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు , ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనంలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు.

తెలంగాణ శాసనసభ ఆవరణలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ విగ్రహానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గాంధీకి నివాలుర్పించారు.

Related posts