telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సిఎం కెసిఆర్

సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించనున్నారని మంత్రి దయాకర్ రావు తెలిపారు. రేపు కానీ, ఎల్లుండి కానీ ఎప్పుడైనా వరంగల్ కు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో వరంగల్ ఎంజీఎంతో పాటు సెంట్రల్ జైల్ పరిశీలిస్తారని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి దయాకర్. సీఎం కెసిఆర్ ఆదేశాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఎంజీఎంలో మెరుగైన సేవలు అందేలా కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాగా నిన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు.

Related posts