telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

KCR cm telangana

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు.

వాస్తవానికి శనివారమే సమీక్ష ఉందన్న సమాచారంతో అధికారులు ప్రగతిభవన్‌కు చేరుకున్నాక, ఆదివారానికి వాయిదే వేసినట్లు ప్రకటించారు. సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇలా సమ్మెలు జరిగినప్పుడల్లా ఇబ్బందులు ఏర్పడటం, ప్రత్యామ్నాయ చర్యలకు సమస్యగా ఉం డటంతో దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని భావిస్తున్నారు.

Related posts