నాగార్జునసాగర్ లో కేసీఆర్… ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధం అయ్యారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ సభ..ఇవాళ సాయంత్రం హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. ఒకవైపు సభ జరగకుండా కాంగ్రెస్ బిజెపి అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి లక్షలాది మందితో సభ నిర్వహించడం ప్రమాదకరమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. అదే విధంగా శివకుమార్ అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇవాళ జరిగే కెసిఆర్ సభకు లైన్ క్లియర్ అయింది.
previous post
మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ?… బిగ్ బాస్ పై కమిట్మెంట్ ఆరోపణలు