telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 25న ఉగాది పండగ రోజున నిర్వహించాల్సి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపైనా ‘కరోనా’ ఎఫెక్ట్ పడింది. ఆరోజుకు బదులుగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సమీక్షించారు. రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలు చేపడుతున్నందున ఉగాది పండగ రోజు నిర్వహించాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వివరించారు.

Related posts