telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఉద్రిక్తత!

jagan tirumala

ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో తీవ్ర తిరుమలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటారనే ప్రచారంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనం ముందు ఈ రోజు నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది.నిరసన తెలిపేందుకు జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతికి రావాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Related posts