సీఎం జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత కళావెంకట్రావు డిమాండ్ చేశారు.టీడీపీ మహిళా కార్యకర్త, రైతు పద్మజను పోలీసులు అరెస్టు చేయడంపై మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా హోం మంత్రి హయాంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు.
మహిళలపై సీఎం జగన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అన్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేసిన వారిని వదిలిపెట్టి టీడీపీ శ్రేణులను వేధించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
ఈఎస్ఐ మందుల స్కామ్లో అధికారపార్టీ నేతలు: లక్ష్మణ్