telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉన్నత చదువుల కోసం ఫీజురీయింబర్స్ మెంట్: సీఎం జగన్

ys jagan cm

ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలని జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు.

పేద విద్యార్థుల చదువుకు ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. జనవరి 9న ‘అమ్మ ఒడి’ ద్వారా మహిళలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. సమాజంలో బలహీన వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలని అన్నారు. 

Related posts