telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక విషయంలో ప్రతిపక్షాల రాద్ధాంతం: మంత్రి కన్నబాబు

minister kannababu

జనంలో సీఎం జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఇసుక కొరత విషయంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత నాలుగు నెలలుగా నదులకు వరద పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.

వరదల్లోనూ ఇసుకను బయటకు తీసే టెక్నాలజీ చంద్రబాబు వద్ద ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని సెటైర్ వేశారు. ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం జగనేనని టీడీపీ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రాజమౌళి, బోయపాటిలతో రాజధానిని ఇడ్లీ పాత్రలా డిజైన్ చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలో కూడా చంద్రబాబుకు తెలియదని, జగన్ కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యేదని అన్నారు.

Related posts