ఏపీలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన సందర్భంగా ‘రాజన్న బడిబాట’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జడ్పీ హైస్కూల్కు సీఎం జగన్ వెళ్తున్నారు. ఉదయం 10.30 గంటలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొంటారు.
రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు మొదటి రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా బడిబాట పట్టారు. కొత్తగా బడిలో చేరేవారితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలలో కనిపించడంతో సందడిగా మారింది.