ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు వాడివేడిగా జరుయాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ…మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండని అన్నారు. ప్రధాన విషయం ఏంటంటే మేము బియ్యం గురించి మేనిఫెస్టోలో పేర్కొనలేదని వెల్లడించారు.
చంద్రబాబు హయాంలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందలేదు. మేము మాత్రం నాణ్యతతో కూడిన బియ్యాన్ని అందిస్తున్నాం. టీడీపీ హయాంలో ప్రజలు తినలేని నాసిరక బియ్యాన్ని అందించారు. నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మేము శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.
అప్పట్లో టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి తీసేసింది. మేమలా చేయట్లేదు. మా మేనిఫెస్టో అందరికీ అందుబాటులోనే ఉంది. ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిదని చెబుతూ మా మేనెఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశామని పేర్కొన్నారు.