ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పిన చంద్రబాబు… ఆయనకు జ్ఞాపికను కూడా బహూకరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్ తో కాసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలనా విధానాలను వివరించారు.
దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు గవర్నర్ కు తెలియజేశారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధివిధానాలను ఆయనకు వివరించారు.
మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్