telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు.

ఏపీ సీఎం చంద్రబాబు,  నారా భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పిన చంద్రబాబు… ఆయనకు జ్ఞాపికను కూడా బహూకరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్ తో కాసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలనా విధానాలను వివరించారు.

దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు గవర్నర్ కు తెలియజేశారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధివిధానాలను ఆయనకు వివరించారు.

Related posts