telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వ్యాప్తిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం: భట్టీ

Batti vikramarka

కరోనా వ్యాప్తిపై చర్యలు తీసుకోవడంలో తెలంగా ప్రభుత్వం విఫలం అవుతోందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణలో కరోనా చావులకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి వనరులన్ని వెచ్చించాలని సర్కార్‌కు సూచించారు. పట్టణాల నుంచి పల్లెలకు కరోనా స్పీడ్‌గా వ్యాపిస్తోందన్నారు. కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. ముందుగా వాటిని కట్టడి చేయాలన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది నియామకం జరగలేదన్న విషయాన్ని భట్టీ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి అరకొర జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కరోనా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది వేతనాలు రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖను నిర్వీర్యం చేశారన్నారు. తాము చెప్పినట్లు సంతకాలుచేసే వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు.

Related posts