telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్‌: భట్టి విక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

ప్రాజెక్టుల అంచనాలు పెంచి అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్‌ దోచుకుంటున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్‌ దోచుకున్న సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన సమయం దగ్గర్లోనే ఉందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ అప్రజాస్వామిక ధోరణితో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పథకంలో అడ్డగోలుగా అంచనాలు పెంచి దాని ద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతి సొమ్ముకు ఆశపడి కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ ఫిరాయించారని బీరంకు ఏమాత్రం నైతికత ఉన్నా తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts