telugu navyamedia
క్రైమ్ వార్తలు

వికారాబాద్‌ జిల్లా బాలిక అత్యాచార, హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో పదిహేనేళ్ల బాలిక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వ‌చ్చాయి. అఘాయిత్యానికి ముందు రోజే పక్కా ప్లాన్‌తో ..అప్పటికే ఉన్న పరిచయంతో తెల్లవారుజామున బాలికను నిర్మానుష్య ప్రదేశానికి ర‌ప్పించి మహేందర్‌తో పాటు అతని స్నేహితులు సుఖేందర్, అశోక్ లైగింక దాడికి కీచకులు ప్రయత్నించారు. చివరికి ప్లాన్ బెడిసికొట్టడంతో ఏకంగా ప్రాణాలే తీశారు.

ప‌క్కా ప్లాన్‌..

మహేందర్ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టి ముందురోజు (ఆదివారం) రాత్రి మిత్రులను ఆహ్వానించి పొలంలోనే ముగ్గురు స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. ఆటైమ్‌లోనే అటాక్‌కు స్కెచ్ వేశారు. బాలికతో మహేందర్‌కు ముందు నుంచే పరిచయం ఉండడంతో.. ఉదయాన్నే తనను కలవాలని బాలికకు మెసేజ్ పెట్టాడు. దాని ప్రకారమే చెప్పిన టైమ్‌కు.. మహేందర్‌ను కలిసేందుకు బాలిక వెళ్లింది. అప్పటికే స్పాట్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులు.. బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో తలపై రాడ్‌తో మోది హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయారు నిందితులు.

సోమవారం ఉదయం ఇంటికి కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో పొదలమధ్య శవమై కనిపించింది. రాయితో కొట్టి, ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

తమ కూతురిని పొట్టనబెట్టుకున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి వేడుకుంటోంది. తన కూతురు అనుభవించిన క్షోభ వాళ్లూ అనుభవించేలా చేయాలని డిమాండ్ చేస్తోంది.

Related posts