సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్తున్న 47L సిటీ బస్సులో గురువారం ఉదయం ఓ వ్యక్తి దిగాడుపంజగుట్ట శ్మశాన వాటిక వద్ద ప్రయాణికులతో వాగ్వాదానికి బస్సు దిగిపొమ్మన్నందుకు, గన్ తీసి ఫైరింగ్ చేశాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు.
ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్ ఆందోళనకు గురయ్యారు.ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదైంది. టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ వాంగ్మూలంను రికార్డు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తికోసం సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సఫారి దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి బస్సులో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.