హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఇనుపరాడ్డు తగిలి వృద్ధుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే ఉస్మానియా వర్సిటీ క్యాంపస్ మాణికేశ్వర్నగర్ ప్రాంతానికి చెందిన శివరాత్రి నరసింహ(60) అనే సివిల్ కాంట్రాక్టర్ రాణిగంజ్ డిపో బస్సులో ప్రయాణిస్తున్నాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయం వద్ద దిగాలనుకున్నాడు.
డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఎదురుగా ఉన్న ఇనుపరాడ్డు నరసింహ ముక్కుకు తగలడంతో బలమైన గాయమైంది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదు: ప్రకాశ్ రాజ్