telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

దండుపాళ్యం చూసి.. హత్యలు, అత్యాచారాలు..ఒక్క జిల్లాలోనే 22 మంది.. !

women gang raped in capital of india

సినిమాలలో చూసి నేరాలు నేర్చుకుంటున్నారన్నది ఇటీవల స్పష్టంగా చూస్తున్న నిజం. సాధారణంగా నేరాలు జరిగిన విధానం చూపించి, వాటి నుండి జాగర్తగా ఉండాలనే సృహ కల్పిస్తారు అధికారులు కూడా. కానీ అది కాస్తా, సినిమాలలోకి వెళ్ళేసరికే కొత్త కొత్త నేరాలు వెలుగు చూస్తున్నాయి. వాటిని రోజువారీగా నేరస్తులు అమలు చేస్తున్నారు. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట సమీపంలోని బౌద్ధారామాల వద్ద జరిగిన శ్రీధరణి (18) హత్య కేసులో నిందితుడై పొట్లూరు రాజును విచారించిన పోలీసులు నమ్మలేని నిజాలను వెలికితీశారు.

‘దండుపాళ్యం’ సినిమాలను చూసి కామ పిశాచిగా మారిన రాజు, తనకు కనిపించిన ప్రేమ జంటలపై దాడులు చేశాడని, సైకోగా మారిపోయి ఇప్పటివరకూ 14 మందిపై అత్యాచారం చేయడంతో పాటు వారిలో నలుగురిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. అతని కన్ను కనిపించిన అమ్మాయి అత్యాచారానికి గురి కావాల్సిందేనని, లేకుంటే కాటికి పోవాల్సిందేనని అధికారులు చెప్పారు. రాజును విచారించిన అధికారులు కూడా అతని దాష్టీకాలు చూసి వీస్తుపోయారు.

Related posts