telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్‌ తో నాగార్జున భేటీ..గుంటూరు నుంచి పోటీ?

Nagarjuna,YS Jagan
వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లోని ఆయ‌న‌ నివాసంలో ప్రముఖ  సినీ నటుడు  అక్కినేని నాగార్జున క‌లిశారు. జగన్‌తో నాగార్జున భేటీ రాజకీయంగా సంచలనం రేపుతోంది. వీరిద్దరి  మ‌ధ్య అర‌గంట పాటు స‌మావేశం జ‌రిగింది. ఏపీలో ప్రస్తుత  రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్‌తో భేటీ త‌ర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు.
గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నాగార్జున చాలా కాలంగా జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రారంభం నుంచి నాగార్జున రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం నాగార్జున-జగన్ భేటీపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.

Related posts