మెగా డాటర్ సుష్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. సుష్మిత నిర్మాతగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్/ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తోంది. మొదటగా ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనుంది. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కరోనా వల్ల ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం సుస్మిత మరో రెండు వెబ్ సిరీస్లు ప్లాన్ చేసిందట. రెండు కూడా రొమాంటిక్ జోనర్లో రూపొందుతాయని తెలుస్తుంది. అయితే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తుందని టాక్. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే సుస్మిత మూడు వెబ్ సిరీస్ లను జీ5 ఓటిటికి ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
previous post
next post
పరుచూరి గోపాలకృష్ణ భార్యను చంపాలనుకున్నా : పోసాని