telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జగదేక వీరుడు అతిలోక సుందరి”ల పారితోషికం ఎంతంటే…?

JVAS

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. 1990లో విడుదలైన ఈ చిత్రం మే 9తో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి – శ్రీదేవి ఎంత పారితోషికం తీసుకుని ఉంటారనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి 35 లక్షలను పారితోషికంగా తీసుకుంటే, శ్రీదేవి 25 లక్షలను తన పారితోషికంగా అందుకున్నారనేది తాజా సమాచారం. బాల్కనీ టికెట్ 6 రూపాయలకి మాత్రమే అమ్మిన ఆ రోజుల్లో, ఈ సినిమా 7 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమా తరువాత చిరంజీవి పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిందని అంటారు.

Related posts