కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి తన కలిసి వచ్చి కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఓటు హక్కున్న చిరంజీవి, తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి వచ్చి ఓటేశారు. తమ వంతు కోసం సుమారు 20 నిమిషాల పాటు వేచి చూసిన చిరంజీవి ఫ్యామిలీ, ఆపై పోలింగ్ బూత్లోనికి వెళ్లి ఓటేసి వచ్చారు.
ఆపై మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు వచ్చి ఓటేస్తుండటంతో ఆయా బూత్ లలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్, లెక్కల్లోనూ వీకే: లోకేశ్