ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన సినిమా “పుష్ప ది రైజ్” అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అందరిలో ఆసక్తిరేగుతుంది.
ఎర్రచందనం నేపథ్యంలో మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రదాన నగరాల్లో వరుస ప్రమోషన్లలో నిమగ్నమైంది. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘పుష్ప’ టీంను ట్విట్టర్ వేదికగా విష్ చేశారు. “గుడ్ లక్ ‘పుష్ప’ టీం… మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, గుండె, ఆత్మను ఉంచారు. మీరు సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అన్ని హృదయపూర్వకంగా అభినందనీయం అన్నారు.
అలాగే డియర్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.