telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా కారణంగా బ్యాంకాక్ బీచ్‌లని మిస్ అవుతావేమో… పూరీ కి చిరు సెటైర్

chiru

ఉగాది రోజున మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీకి అపూర్వ స్పందన లభించింది. సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయనకు వెల్కమ్ చెప్పారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా చిరంజీవిని ఆహ్వానించాడు. `సర్! సోషల్ మీడియాలోకి స్వాగతం. సామాజిక దూరం పాటిస్తున్న ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది` అని పూరీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు మెగాస్టార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. `ధన్యవాదాలు పూరీ జగన్నాథ్. కరోనా కారణంగా మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. నువ్వు ముంబై, బ్యాంకాక్ బీచ్‌లని మిస్ అవుతావేమో కానీ పవిత్ర, ఆకాష్ నీతో సమయం గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు` అని చిరంజీవి రిప్లై ఇచ్చారు. దీనికి పూరీ స్పందిస్తూ.. `అన్నయ్యా లవ్ యూ` అంటూ ట్వీట్ చేశాడు.

Related posts