ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్తో సినీ రంగానికి చెందిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ముగిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సూమారు గంటర్నపాటు పై సాగిన ఈ చర్చలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జగన్ తో చిరంజీవి చర్చించినట్లు తెలుస్తోంది.
మరో సారి సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలను తీసుకొచ్చి జగన్తో చిరంజీవి భేటి కానున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం నేరుగా చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.
కాగా..ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ తో అన్ని విషయాలపై చర్చిస్తానని ఆయన చెప్పారు. మరో గంటన్నరలో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని చిరంజీవి తెలిపారు