మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ కు పడట్లేదని, వారి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వాటిలో నిజం లేదని వీరిద్దరూ చాలా సార్లు చెప్పారు. ఒకప్పుడు టాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోలు. వీరిద్దరి సినిమాల మధ్య గట్టి పోటీ నడిచేది. చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఆ హీట్ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగాయి. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాల్లో చేసుకున్న విమర్శలు అక్కడి వరకేనని, చిరంజీవి తనకు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ అని బాలకృష్ణ చాలా సార్లు చెప్పారు. చిరంజీవి కూడా బాలకృష్ణ తనకు మంచి మిత్రుడని ఎన్నోసార్లు అన్నారు. అయితే వీళ్లిద్దరూ కలిసేది చాలా అరుదు. ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఎప్పుడోకానీ కలుసుకోరు. అనుకోకుండా కలుసుకుంటే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. తాజాగా కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ కలుసుకున్నారు. పక్కపక్కన సోఫాల్లో కూర్చొని ఏవో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఇద్దరూ చాలా సీరియస్గా ఏదో విషయం గురించి మాట్లాడుతున్నట్టు ఉంది.
previous post