మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య.
ఇందులో రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. అలాగే చిరంజీవిగారి పాత్ర చాలా పవర్ఫుల్గా కనిపించబోతుందంట. ఇప్పటికే విడుదలైన లాహే లాహే.. సాంగ్, టీజర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి.
నేటితో టాకీ పార్ట్కి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈసినిమా కోసం ధర్మస్థలి అంటూ భారీ సెట్ ఒకటి నిర్మించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్లకు పైగా ఖర్చుతో ఈ సెట్ నిర్మించారంట. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ విడుదల చేయలేదు.
కాగా.కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పై మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.