ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్లో 25వ డివిజన్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తరఫున టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థులు లేని డివిజన్లలో మాత్రమే జనసేన కోసం ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా చింతమనేని పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి 25వ డివిజన్ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్ డ్రా చేయించారని అందుకే 25 వ డివిజన్లో జనసేన అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నామని చింతమనేని తెలిపారు. టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న డివిజన్లలో… పోటీలో బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులుంటే వారి తరఫున ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు చింతమనేని ప్రభాకర్.
previous post