ప్రముఖ ఆథ్యాత్మిక గురువైన చినజీయర్ స్వామి ఓ ముస్లిం భక్తుడి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలోని సాదిక్ హుసేన్ చినజీయర్ స్వామివారి భక్తుడు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి చినజీయర్ స్వామి వెళ్లారు. తమ ఇంటికి చినజీయర్ రావడంతో సాదిక్ కుటుంబీకులు ఆనందంలో మునిగిపోయారు.
స్వామికి పాదపూజ చేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబీకుల యోగక్షేమాలను చినజీయర్ అడిగి తెలుసుకున్నారు. చినజీయర్ స్వామి వచ్చారనే వార్తతో భారీ ఎత్తున భక్తులు అక్కడకు తరలి వచ్చారు. వారందరనీ చినజీయర్ ఆశీర్వదించారు. పరమత సహనాన్ని చాటి చెప్పారు. అన్ని మతాలు ఒకటేనని, అన్ని మతాల ప్రజలు సమానులేనని హితబోధ చేశారు.