telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మమ్మల్ని వెలివేశారంటూ జగన్ కు చిన్నారి లేఖ.. స్పందించిన చంద్రబాబు

chandrababu

మమ్మల్ని వెలివేశారంటూ ఏపీ సీఎం జగన్ కు ప్రకాశం జిల్లా చిన్నారి లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే ఆ బాలిక తన తండ్రి, తాతలను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమను వెలివేశారని లేఖలో పేర్కొంది. ఆ చిన్నారి రాసిన లేఖ పలువురి హృదయాలను కదిలించింది. కనీసం తనకు స్కూల్లో భోజనం పెడతారో లేదో అంటూ దీనంగా అడగడం అందరినీ చలించిపోయేలా చేసింది. చిన్నారి రాసిన లేఖ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు.

కల్లాకపటం తెలియని పసివయసులో ఒక చిన్నారి వెలివేయడం అనే అనాగరిక చర్యను ఎదుర్కోవాల్సి రావడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా చిన్నారి పుష్ప విన్నపాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. తన సొంతూళ్లో పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించిన పుష్ప ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నానని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts