ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి విన్నూతన రీతిలో జగన్ బర్త్డే విసెష్ చెప్పారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోని గోశాల ముందు రొటీన్ కు భిన్నంగా ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్పై సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు.
వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రాన్ని రూపొందించారు. ఆర్టిస్ట్ కాంత్ రీషా దేశంలోనే తొలిసారిగా ఈ ఆర్ట్ ఫార్మింగ్ ను రూపొందంచారు
ఈ ముఖ చిత్రం ఏర్పాటు కోసం గత పది రోజుల నుంచి చెవిరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసు వద్దనే ఉన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పనులు చేయించారు. డ్రోన్పై నుంచి చూస్తే సీఎం జగన్ ముఖచిత్రం ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై రోజా కౌంటర్