telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : చెన్నై ఖాతాలో రెండో విజయం….

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాజస్థాన్ కు మంచి శుభారంభానే దక్కింది. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (49) తో అదరగొట్టిన మిగిత వారు అందరూ పెవిలియన్ కు దారి కట్టారు. చెన్నై బౌలర్లు చివరి ఓవర్లలో వరుస వికెట్లు తీయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు చేయడంతో చెన్నై 45 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో మొయిన్ అలీ(26) తో కలిసి డు ప్లెసిస్(33) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. ఇక వారు పెవిలియన్ చేరుకున్న తర్వాత వచ్చిన రైనా, రాయుడు అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక బ్యాటింగ్ కు వచ్చిన డ్వేన్ బ్రావో వేగంగా ఆడటంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Related posts