telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : రాణించిన హుడా… చెన్నై లక్ష్యం..?

ఈ రోజు అబుదాబి వేదికగాఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ టాప్ ఆర్డర్ తడబడింది. అయితే 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిన పంజాబ్ 20 ఓవర్లు ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా 153 పరుగులు చేసింది. ఇందుకు కారణం ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బాట్స్మెన్ దీపక్ హుడా. కేవలం 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. ఇక చెన్నై బౌలర్లలో లుంగి ఎన్గిడి 3 వికెట్లు పడగొట్టగా శార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే చెన్నై 154 పరుగులు చేయాలి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న చెన్నై ఐపీఎల్ 2020 లో తమ చివరి మ్యాచ్ లో విజయం సాధించిహ్ లీగ్ నుండి గౌరవంగా తప్పుకోవాలని చూస్తుంది. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts