ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఎంపికైనప్పుడు నేను కూడా జెర్సీ లో నానిలానే ఏడ్చానని చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్, తెలుగు క్రికెటర్ హరిశంకర్ రెడ్డి తెలిపాడు. తాను ఐపీఎల్ వేలానికి ఎంపికయ్యావని చెప్పగానే సహచర ఆటగాళ్లంతా అభినందించారని, కానీ తనకు మాత్రం జెర్సీ సీన్ గుర్తొచ్చిందన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం సన్నద్ధమవుతున్న అతను.. తాజాగా మాట్లాడుతూ… ‘జెర్సీ సినిమాతో నేను ఎంతగానో కనెక్ట్ అయ్యాను.. క్రికెటర్ల భావోద్వేగాలను ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. సాధారణ ప్రజలకు ఆ సీన్ ఓవరాక్షన్లా ఉండొచ్చు. కానీ క్రికెటర్లకు ఆ బాధ ఏంటో తెలుసు. నేను ఐపీఎల్ వేలానికి ఎంపికైనప్పుడు సహచర ఆటగాళ్లంతా అభినందించారు. కానీ నేను రూమ్లో వెళ్లి ‘అమ్మా’అని గట్టిగా అరిచా.. ఆ క్షణం నాకు జెర్సీ సినిమాలోని సీన్ గుర్తొచ్చింది.’అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో సీఎస్కే అతన్ని రూ. 20 లక్షల కనీధరకు కొనుగోలు చేసింది. ఇటీవల జట్టు ప్రాక్టీసులో భాగంగా అతడు ఏకంగా కెప్టెన్ ధోనీనే బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
previous post