telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఏపీ యువతుల దుర్మరణం

Road accident 8 dead and 30 injured

చెన్నైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆఫీసుకు వెళ్లే క్రమంలో తమ సహోద్యోగితో ఒకే బైక్ పై ఆఫీసుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంసంభవించింది. ఏపీకి చెందిన భవాని, లక్ష్మి అనే యువతులు ఉపాధి కోసం చెన్నైలో ఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

సహ ఉద్యోగి శివన్ తో కలిసి బైక్ పై వెళుతుండగా, మరో బైక్ ఢీకొట్టింది. దాంతో శివన్ బైక్ ను కంట్రోల్ చేయలేకపోయాడు. అదే సమయంలో ఓ బస్సు దూసుకురావడంతో ముగ్గురు దాని కిందికి వెళ్లిపోయారు. ఈ ఘటనలో భవాని, లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. శివన్ కు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అతన్నిరాయపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్తితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Related posts