“ఫిదా” తరువాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్న విషయం విదితమే. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం “లవ్ స్టోరీ” పేరుతో ప్రచారం జరుపుకుంటుంది. ఇటీవల చైతూ బర్త్డే సందర్భంగా చిత్ర టీజర్ ఒకటి విడుదల చేశారు. ఇందులో చైతూ కూల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చెబుతున్నారు. ఫిదా చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.