telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ హతం

naksals encounter

ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతం మరోసారి తుపాకుల మోటామోగింది. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. అటవీప్రాంతంలో బలగాల రాకను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.

దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో ఐదుగురు మావోయిస్టులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. ఈ ఘటనలో మావోల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

Related posts