ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతం మరోసారి తుపాకుల మోటామోగింది. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. అటవీప్రాంతంలో బలగాల రాకను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.
దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో ఐదుగురు మావోయిస్టులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. ఈ ఘటనలో మావోల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.