టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి తల్లిదండ్రులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఛార్మి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తన తల్లిదండ్రులకు అక్టోబర్ 22న వారికి కొవిడ్ పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్లోని తన నివాసంలో ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారని ఛార్మి చెప్పారు. ఇటీవల వచ్చిన హైదరాబాద్ వరదలు, ఇతర పరిస్థితుల కారణంగా ఈ మహమ్మారి సోకిందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాట తెలియగానే భయమేసిందని ఆమె అన్నారు. వాళ్లిద్దరూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన తల్లిదండ్రులను త్వరలోనే ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఛార్మి కౌర్. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాల్సిందిగా కోరుతున్నా అని ఆమె కోరారు. కాగా ప్రస్తుతం పూరి జగన్నాథ్తో కలిసి సినిమా నిర్మాణాల్లో భాగం పంచుకుంటోంది ఛార్మి. విజయ్ దేవరకొండ హీరోగా ఆమె నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
I thank @AIGHospitals and it’s total team for all the care they are taking of parents to fight #coronavirus 🙏🏻
Doctor NAGESHWAR REDDY u r my hero 🙏🏻 pic.twitter.com/OmloT8r8Sr
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2020