పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్తో ముందుకు సాగుతోంది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసినట్టు సమాచారం. హీరోయిన్ నుండి నిర్మాతగా మారిన ఛార్మి పూరీ కనెక్ట్స్ బేనర్పై సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది ఛార్మి. అయితే సినిమా షూటింగ్ తొలి రోజు నుండి సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూ వస్తున్న ఛార్మి తాజాగా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి తన ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. “ఇస్మార్ట్ శంకర్’లోని ‘ఉండిపో’ అనే రొమాంటిక్ సాంగ్ను మాల్దీవులులో చిత్రీకరించాం. కొన్ని షాట్స్ని ఇసుక దీవీలో చిత్రీకరించాం. అయితే ఆ దీవీ ప్రతి రోజు కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత సముద్రం ముందుకు రావడంతో మునిగిపోతుంది. దీవి కనిపిస్తున్న సమయంలోనే సాంగ్ షూట్ చేసాం. అయితే సాంగ్ చిత్రీకరణ సమయంలో చాలా భయమేసింది. ఎక్కడ సముద్రంలో మునిగిపోతామేమోనని వణుకుపుట్టింది” అంటూ ఓ వీడియో షేర్ చేస్తూ తన అనుభవాన్ని వివరించింది ఛార్మి. షూటింగ్ అయిపోయిన తరవాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కడం ఈ వీడియోలో కన్పిస్తోంది.
The sand bank island in #Maldives is alive only for few hrs every day .. shot few very exclusive shots from #undipo song there for #iSmartShankar 😁 n this was the tense me 🙈 worried if all of us will sink in the ocean 🙈🙈🙈😂😂😂 pic.twitter.com/Av9Wxroh58
— Charmme Kaur (@Charmmeofficial) 6 August 2019