బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా ఓ బయోపిక్ లో నటిస్తోంది. ఆ బయోపిక్ ఎవరిదంటే ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిది. ఈ సినిమాకు ఇప్పటికే “ఛాపక్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ న ఈరోజు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు దీపికా. తాజాగాఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నేపధ్యంలో చిత్ర యూనిట్ ఒక గ్రూప్ ఫొటో దిగింది. ఈ ఫొటోను దీపిక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు దీపిక భర్త రణవీర్ సింగ్ తొలి కామెంట్ చేశారు. దీపిక తన పోస్టులో “ఇది నా సినీ కెరియర్లో అత్యుత్తమ సినిమా. మీరంతా 2010 జనవరి 10 “ఛపాక్” సినిమా చూడవచ్చు” అని రాశారు. కాగా దీపిక పోస్టుకు రణవీర్ తన స్పందనను తెలియజేస్తూ “నేను ఈ అద్భుతాన్ని చూసేందుకు ఇంకా వెయిట్ చేయలేను” అని రాశారు. కాగా ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందించారు. దీపిక ‘లక్ష్మి’ పాత్ర పోషించడంతో పాటు, ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
previous post
వాళ్ళు కచ్చితంగా వేరే జాతి వాళ్ళే… మలైకా ఘాటు వ్యాఖ్యలు