ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తను వేసిన ఓటు పై అనుమానం వ్యక్తం చేశారు. నేనేసిన ఓటు నాకు పడిందా.. వేరే పార్టీకి వెళ్లిందా అనే డౌట్ ఉన్నట్టు తెలిపారు. శుక్రవారంఅమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేపు డిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.
ఈవీఎంల పనితీరు పై నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. .బ్యాలెట్ పేపర్పై ఓటేస్తే నమ్మకం ఉండేదన్నారు. కానీ ఈవీఎంలలో ప్రోగ్రామింగ్ మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఐదేళ్ల పాటు కష్టపడి ప్రోగ్రామింగ్ మీద ఆధారపడాలా అని ఆయన ప్రశ్నించారు. ఈసీ చేసిన తప్పులకు తాము శిక్షను అనుభవించాలా అని ఆయన ప్రశ్నించారు. నిన్నటి ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు.
ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం: ఎంపీ కోమటిరెడ్డి