telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలి సమావేశాల్లో షరీఫ్ పై దారుణంగా ప్రవర్తించారు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

శాసనమండలి సమావేశాల్లో చైర్మెన్ షరీఫ్ పై వైసీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో రెండో రోజున చైర్మన్ షరీఫ్ ను వైసీపీ సభ్యులు బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులు పాసవుతాయని, నెగ్గుతామని వైసీపీ సభ్యులు షరీఫ్ ని బెదిరించారని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఇంకా తన ఇష్టానుసారం బూతులు తిట్టారని, గ్యాలరీలో కూర్చున్న తాను ఇదంతా గమనించినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం, కరెక్టు కాదన్న ఉద్దేశంతోనే ఆ రోజున తాను శాసనమండలి గ్యాలరీకి వెళ్లానని చంద్రబాబు తెలిపారు.

Related posts