వచ్చే నెల పదవ తేదీన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు రానున్నారు. ఆయన రెండు రోజులపాటు నగరంలోని పార్టీ కార్యాలయంలో బస చేయనున్నారు. తొలిరోజు కార్యకర్తలతో సమావేశం అవుతారు. మరుసటి రోజు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.
పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పర్యటనపై నేతలు చర్చించారు. నియోజక వర్గాలలో పార్టీపరంగా వున్న అంశాలపై నాయకులు, కేడర్ నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారని పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.