telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీల అభ్యున్నతికి ఎంతో కృషిచేశాం: చంద్రబాబు

chandrababu

బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన పార్టీ తెలుగుదేశమని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని కీ.శే.బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ ఆ మహనీయుని ‘సమతావాదం’ ఆదర్శంగా దళితాభ్యుదయానికి పునరంకితం అవుదామని టీడీపీ పిలుపునిచ్చారు.

దేశానికే దిశానిర్దేశం చేసే లోక్ సభ స్పీకర్ గా ఒక దళితనేతను చేసిన పార్టీ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ గా ఒక దళిత మహిళానేతను గౌరవించిన పార్టీ తెలుగుదేశం. ‘అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, జ్యోతిరావ్ పూలే వంటి మహాశయుల లక్ష్యాల సాధన కోసం అంకితమైన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. గత ఐదేళ్ల పాలనా కాలంలోనూ ఎస్సీల అభ్యున్నతికి ఎంతో కృషిచేశాం’ అని చెప్పారు.

‘పేద ఎస్సీ ఆడబిడ్డ పెళ్లికి రూ.40 వేలు పెళ్లి కానుకగా ఇచ్చాం. ఎస్సీ విద్యార్థుల విదేశీ చదువులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాం. ‘జ్ఞానభూమి’ ద్వారా లక్షలాది విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ఉపకారవేతనాలు ఇచ్చాం’ అని తెలిపారు.

‘జగ్జీవన్ జ్యోతి’ పథకం కింద ఎస్సీల ఇళ్ళకు 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చాం. డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1,500 పింఛను ఇచ్చాం. ఎస్సీల సంక్షేమానికి 4ఏళ్లలోనే రూ.40,253 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6.56 లక్షల మందికి జీవనోపాధులు కల్పించాం’ అని ట్వీట్ చేశారు.

Related posts