*గోరంట్ల మాదవ్ వీడియో పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు
*తప్పులను కప్పిపుచ్చేందుకు కుల మతాలను అడ్డు పెడుతున్నారు..
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందన్నారు. సిగ్గులేనోళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
సిగ్గులేనోళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన అన్నారు. ఊరుకు ఒక ఆంబోతులు తయారవుతున్నారని.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలినోళ్లని చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు
తప్పు చేసిన వారిని ముఖ్యమంత్రి మందలించి దండిస్తే మిగిలిన వాళ్లకు భయం వస్తుందన్నారు. సీఎం జగన్ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు లాంటివి పెరిగిపోతున్నాయన్నారు.
సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నారని.. రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు.
జగన్ ఢిల్లీ టూర్తో రాష్ట్రానికి ప్రయోజనం లేదు: యనమల